search on

Sunday, October 23, 2016

Chinese sales down

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ను మంచీచెడ్డ అనే తేడా లేకుండా వెనకేసుకొస్తున్న చైనాకు భారతీయులు షాకిచ్చారు. దివాళీ సందర్భంగా బాణాసంచాతో పాటు చైనా తయారీ వస్తువులను కొనకుండా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఎంతగా అంటే 40 శాతం సేల్స్ పడిపోయాయి. ఎల్‌సిడి టీవీల కొనుగోళ్లు 15 శాతం పడిపోయాయి. చైనా మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ గూడ్స్‌ సేల్స్ కూడా విపరీతంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా చైనా ఉత్పత్తులను కొనరాదంటూ కొన్ని సంస్థలిచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. భారతీయులు స్వదేశీ వస్తువులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతీయుల్లో ఇంతటి మార్పు ఇటీవలి కాలంలో ఇదే ప్రధమమని చెబుతున్నారు. యూరీ దాడి తర్వాత కూడా పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదిపై నిషేధం పడకుండా కాపాడుకుంటూ వస్తున్న చైనాకు గుణపాఠం నేర్పాలన్న పిలుపునకు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ ఉత్పత్తులనే కొంటున్నారని జైపూర్ వ్యాపార్ మహాసంఘ్ కార్యదర్శి విజయ్ వర్గీయ తెలిపారు. చైనా తయారీ డెకరేటివ్ లైట్లు, విగ్రహాల అమ్మకాలు కూడా పడిపోయాయాని వ్యాపారి శ్యామ్ మీనా తెలిపారు. స్వదేశీ ఉత్పత్తుల ధరలు చైనా ఉత్పత్తులతో పోల్చితే ఎక్కువ ధర అయినా భారతీయులు ఇండియన్ ప్రాడక్ట్స్‌నే కొంటున్నారని వెల్లడించారు. వాస్తవానికి చైనా తయారీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాని ప్రభావమే చైనా ఉత్పత్తుల సేల్స్ పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Prabhas takes tollywood to another level ie our bahubali star






యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌….ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌….ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. తెలుగు సినిమా హీమాన్‌గా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్‌స్టార్‌గా ప్రభాస్‌ ఎదగడం వెనుక ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్‌ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్‌ని కోట్లాది మంది అభిమానించే రెబల్‌స్టార్‌ని చేశాయి.
రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.
బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్‌ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్‌ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్‌ హీరో అయ్యారు. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్‌ చేయడంతోపాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2లో ప్రభాస్‌ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంటే యూనివర్సల్‌ హీరోగా ప్రభాస్‌ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారో అర్థమవుతుంది.
ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ప్రభాస్‌ బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను తెలియచెప్పారు. బాలీవుడ్‌లో బాహుబలి హిందీ వెర్షన్‌ వందకోట్ల రూపాయలను వసూళ్లు చేయడం గొప్ప విషయం. ప్రభాస్‌ నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్‌ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్‌కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్‌గా యావరేజ్‌ సక్సెస్‌ను సాధించిన సినిమాలు కూడా సోషల్‌ మీడియాల్లో, డబ్బింగ్‌ వెర్షన్స్‌లో సూపర్‌హిట్‌ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్‌ చూసిన చిత్రాలుగా నిలిచాయి.
కొన్ని సినిమాలు.. కొన్ని కథలు ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు కానీ ‘బాహుబలి’లాంటి సినిమా చెయ్యాలంటే ప్రభాస్‌ ఒక్కడే చెయ్యగలడని ‘బాహుబలి ది బిగినింగ్‌’ విడుదలకు ముందు అనుకున్నారు. రిలీజ్‌ తర్వాత అవును నిజమే….బాహుబలిగా ప్రభాస్‌ స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు…అది కూడా రికార్డుల రూపంలో…బహుబలి చిత్రాన్ని ప్రభాస్‌ కోసమే రాజమౌళి స్పెషల్‌గా డిజైన్‌ చేశారు. ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ‘బాహుబలి’ని ఓ అపురూప శిల్పంలా రూపొందించారు…రూపొందిస్తున్నారు
తెలుగు సినిమా అంటే ఏవో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్‌.. కొన్ని కామెడీ డైలాగులు పెడితే సరిపోతాయి కదా అనుకున్నవారందరూ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఇది విజువల్‌ వండర్‌ అంటూ అప్రిషియేట్‌ చేశారు. ముఖ్యంగా హీరో ప్రభాస్‌ బాహుబలి పార్ట్‌ 1 కోసమే రెండేళ్లు కష్టపడ్డారు. ఈజీగా సినిమాలు చేసుకునే అవకాశాలున్నా ప్రభాస్‌ ఒక సినిమా కోసం రెండేళ్ళు ఇంకే సినిమా కమిట్‌ అవకుండా వర్క్‌ చెయ్యడం ఏమిటి? సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఏమిటి? సినిమా కోసం నిజంగా కత్తి యుద్దాలు నేర్చుకోవడం ఏమిటి? రెండేళ్ళలో ఈజీగా నాలుగు పక్కా కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు అన్నీ వస్తాయి కదా.. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి.. కథ చెప్తానని ఎవరు అడిగినా వినకుండా.. ఏ నిర్మాత ఎంత భారీ రెమ్యూనరేషన్‌ ఇస్తానని ఆఫర్‌ ఇచ్చినా.. ఒప్పుకోకుండా సున్నితంగా తిరస్కరిస్తూ.. అందరికీ ప్రభాస్‌ బాహుబలి కోసమే తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు.
బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్‌ వెచ్చించిన సమయం నాలుగేళ్లు. ఇలా ఒక స్టార్‌ హీరో తన కెరీర్‌లో నాలుగేళ్ళ విలువైన సమయాన్ని ఓ సినిమాకే కేటాయించడం ప్రభాస్‌ డేడికేషన్‌కు నిదర్శనం. ఏ సినిమా చేసినా బాహుబలి తర్వాతే అంటూ ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు.. ఎంత గొప్ప సినిమా చేస్తున్నాం అన్న పాయింట్‌ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘బాహుబలి’ని తన నటనతో జీవం పోస్తున్నాడు ప్రభాస్‌. అందరి అంచనాలను మించి బాహుబలి ది బిగినింగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. 600 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. టాలీవుడ్‌ జక్కన్నగా పేరున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్‌ 1 హై బడ్జెట్‌తో, విజువల్‌ టెక్నాలజీతో తెలుగు సినిమా స్టామినాని తెలియజేసింది. సైమా, ఐఫా అవార్డ్స్‌, నేషనల్‌ అవార్డ్స్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అంతే చైనాలో 5000 థియేటర్స్‌లో విడుదలై సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. చైనాతో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘బాహుబలి’గా ప్రభాస్‌ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడవ్‌ు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టిం చబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో మార్చ్‌ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్‌ నిలవబోతున్నారు. ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ప్రముఖ నటులు, రాజకీయనాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు.
భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్ల పరంగా ప్రపంచంలో మూడవస్ధానంలో, భారతదేశంలో మొదటి స్ధానంలో నిల్చిన ‘బాహుబలి’ ది బిగినింగ్‌ (2015)’ లో నటించిన ప్రభాస్‌, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ప్రభాస్‌ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైదరా బాద్‌లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహు బలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్‌ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.

కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?.. ఈ ప్రశ్న తెలుగు ప్రేక్షకులనే కాదు..ఇండియాలో చాలా ఫేమస్‌ అయ్యింది. కానీ సమాధానం మాత్రం తెలియడం లేదు..ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్‌ 28, 2017 వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే బాహబలి 2 మరి అదే రోజున విడుదలవుతుంది. అయితే ఆలోపే బాహుబలికి సంబంధించి ఫెస్టివల్‌ను స్టార్స్‌ చేస్తున్నామని హీరో ప్రభాస్‌ తెలియజేశారు. నా ఫ్యాన్స్‌, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్‌ లుక్‌ను అక్టోబర్‌ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేస్తున్నామని ప్రభాస్‌ అన్నారు. బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్‌ నుండి విడుదలవుతూ ఆడియన్స్‌ని ఎగ్జయిట్‌ చేస్తున్నాయి. బాహుబలి యానిమేటెడ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.
ఒక మహావృక్షంగా తీసుకుంటే టీవీ సీరీస్‌, కామిక్స్‌, బుక్స్‌, గేమ్స్‌ అన్నీ హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతే కాకుండా బాహుబలితో వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్‌ అనే దాన్ని పరిచయం చేస్తుండటం విశేషం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్‌ రియాలిటీ హయ్యండ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మేకింగ్‌ వీడియోస్‌ని వర్చువల్‌ రియాలిటీలో చేస్తున్నారు. మేకింగ్‌ వీడియోలను కూడా హయ్యండ్‌ క్వాలిటీస్‌తో రూపొందిస్తున్నారు. ఇన్ని రకాల విశేషాలతో మరోసారి తెలుగు సినిమా స్టామి నాని, వాల్యూను పెంచి బాహుబలి2 ఎప్పు డెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. బాహుబలి పార్ట్‌ 1తో 600 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన హీరో ప్రభాస్‌ బాహుబలి2తో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు






Mahesh babu back step ..for .. bhubali2. Conclusion....Mahesh cinema out of the race ....















సూపర్ స్టార్ మహేష్ బాబు వెనక్కి తగ్గారు. కమర్షియల్ డైరక్టర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది. ఏప్రిల్ 28 న విడుదల చేయాలని  ప్రిన్స్ మొదట భావించారు.
ఆరోజు విడుదలైన పోకిరి సూపర్ హిట్ కావడంతో ఎలాగైనా ఆరోజు సినిమా రిలీజ్ చేయాలని అనుకుకున్నారు. కానీ అదే రోజు బాహుబలి 2 వస్తుందని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయితే  ఫస్ట్ డే కలక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుందని అర్ధం చేసుకొని, తన సినిమాను బాహుబలి కంక్లూజన్ కంటే రెండు వారాలు ముందు రిలీజ్ చేయాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 14న  సూపర్ స్టార్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Prabhas birthday special


Prabhas birthday special





























తెలుగు సినీ పరిశ్రమలో ఈశ్వర్ చిత్రంతో తొలి అడుగు వేసి బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ఛత్రపతి నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ కి ఈ జన్మదినం వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకో ఈ ఆర్టికల్ చదివితే మీకే తెలుస్తుంది.
ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు 1979 అక్టోబర్ 23 న జన్మించారు. 2016 అక్టోబర్ 23 న 37 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సంఖ్యాశాస్రం ప్రకారం 3 + 7 = 10, 1+0 = 1. ప్రభాస్ ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో నంబర్ వన్ గా ఉంటారు.

ప్రభాస్ తన 37 ఏటనే బ్యాచలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఒకరు ఇద్దరు కాబోతున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం షూటింగ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే కల్యాణ ఘడియలు మొదలు కానున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లలో రెబల్ స్టార్
బాహుబలితో ప్రభాస్ కి అన్ని భాషల్లో క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇక డార్లింగ్ చేసే ప్రతి సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. సుజీత్ దర్శకత్వంలో చేయనున్న మూవీ కూడా మూడు భాషల్లో నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ వాళ్లు సన్నాహాలు చేస్తున్నారు.
బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత నుంచి యంగ్ రెబల్ స్టార్ అనే పేరు చెరిగి పోయి ఇండియన్ స్టార్ గా మారనున్నారు. ఇప్పటికే ఇంటర్ నేషనల్ మీడియా ప్రభాస్ ని ఇండియన్ స్టార్ గా పిలుస్తోంది. ఆ గుర్తింపు స్థిరపడిపోనుంది.
ప్రభాస్ తన 37 ఏటనే 15 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అర్ధం కాలేదా.. ? ఆయన రీల్ వయసు 15 కానుంది. యంగ్ రెబల్ స్టార్ తొలి చిత్రం ఈశ్వర్ 2002 నవంబర్ 11న రిలీజ్ అయింది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి నటుడిగా పదిహేనవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
మేడం టుస్సాడ్ వారు బ్యాంకాక్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చిలో ఆవిష్కరించనున్నారు. అంటే ఆ గౌరవం కూడా ప్రభాస్ 37 ఏటనే దక్కనున్నదన్న మాట.
ఇలా ప్రభాస్ కి ఈ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్ కానుంది. అంతేకాదు బాహుబలి కంక్లూజన్ లోని నటనకు దాసోహం అనేందుకు అనేక అవార్డులు రెడీగా ఉన్నాయి.

Prabhas next movie budget fixed


ఫిక్స్ అయిన ప్రభాస్ నెస్ట్ సినిమా బడ్జెట్

















బహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు డార్లింగ్ తో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. తెలుగు అభిమానులతో పాటు పొరుగు రాష్ట్రాల వారిని మెప్పించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు కథ, నటీనటులు, టెక్నీషియన్లు అవసరమవుతారు. ప్రభాస్ కి పెరిగిన మార్కెట్ కి సరితూగేలా నిర్మించాలి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని బాహుబలి తర్వాత డార్లింగ్ చేయనున్న సినిమా బడ్జెట్ ని పెంచారు.
“రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రానున్న యంగ్ రెబల్ స్టార్ ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ  యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం మొదట 100 కోట్లు ఖర్చుఅవుతుందని భావించారు. తాజాగా ఆ బడ్జెట్ ని 150 కోట్లకు పెంచారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ సినిమా 2017 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.