నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే(స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అంత కష్టం మరియు పెద్ద సాహసం. అది కూడా వర్షాకాలం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే సెల్ ఫోన్ లు పనిచేయవు, రాత్రి పూట చాల భయంకరంగా ఉంటుంది , తిండి ఉండదు కనీసం తాగటానికి నీళ్ళు కూడా దొరకడం కష్టం. ఎక్కడ పులులు, సింహాలు వచ్చి మీద పడతాయని భయం. అందుకని చాల జాగ్రత్తాగా గ్రూప్ గా వెళ్ళాల్సిన ప్రదేశం. అయితే అక్కడ ఉన్న ఆ ప్రత్యేకతలను, గొప్పతనాన్ని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాము. మీరు చూసి ఆనందిచండి, అంత దూరం వెళ్లి ఆ అద్భుతాలను చూడలేని వాళ్ళకు ఇవి చూపించండి…
No comments:
Post a Comment