న్యూఢిల్లీ: పాకిస్థాన్ను మంచీచెడ్డ అనే తేడా లేకుండా వెనకేసుకొస్తున్న చైనాకు భారతీయులు షాకిచ్చారు. దివాళీ సందర్భంగా బాణాసంచాతో పాటు చైనా తయారీ వస్తువులను కొనకుండా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఎంతగా అంటే 40 శాతం సేల్స్ పడిపోయాయి. ఎల్సిడి టీవీల కొనుగోళ్లు 15 శాతం పడిపోయాయి. చైనా మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్ కూడా విపరీతంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా చైనా ఉత్పత్తులను కొనరాదంటూ కొన్ని సంస్థలిచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. భారతీయులు స్వదేశీ వస్తువులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతీయుల్లో ఇంతటి మార్పు ఇటీవలి కాలంలో ఇదే ప్రధమమని చెబుతున్నారు. యూరీ దాడి తర్వాత కూడా పాకిస్థాన్ను వెనకేసుకొస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదిపై నిషేధం పడకుండా కాపాడుకుంటూ వస్తున్న చైనాకు గుణపాఠం నేర్పాలన్న పిలుపునకు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ ఉత్పత్తులనే కొంటున్నారని జైపూర్ వ్యాపార్ మహాసంఘ్ కార్యదర్శి విజయ్ వర్గీయ తెలిపారు. చైనా తయారీ డెకరేటివ్ లైట్లు, విగ్రహాల అమ్మకాలు కూడా పడిపోయాయాని వ్యాపారి శ్యామ్ మీనా తెలిపారు. స్వదేశీ ఉత్పత్తుల ధరలు చైనా ఉత్పత్తులతో పోల్చితే ఎక్కువ ధర అయినా భారతీయులు ఇండియన్ ప్రాడక్ట్స్నే కొంటున్నారని వెల్లడించారు. వాస్తవానికి చైనా తయారీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాని ప్రభావమే చైనా ఉత్పత్తుల సేల్స్ పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
search on
Sunday, October 23, 2016
Prabhas takes tollywood to another level ie our bahubali star


యంగ్ రెబల్స్టార్ ప్రభాస్….ఆరడుగుల హైట్, హైట్కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్….ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్నారు. తెలుగు సినిమా హీమాన్గా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్స్టార్గా ప్రభాస్ ఎదగడం వెనుక ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్ని కోట్లాది మంది అభిమానించే రెబల్స్టార్ని చేశాయి.
రెబల్స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్నిరంజన్’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’ వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.
బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్ హీరో అయ్యారు. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతోపాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2లో ప్రభాస్ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంటే యూనివర్సల్ హీరోగా ప్రభాస్ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారో అర్థమవుతుంది.
ఒకప్పుడు బాలీవుడ్లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ప్రభాస్ బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ను తెలియచెప్పారు. బాలీవుడ్లో బాహుబలి హిందీ వెర్షన్ వందకోట్ల రూపాయలను వసూళ్లు చేయడం గొప్ప విషయం. ప్రభాస్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్గా యావరేజ్ సక్సెస్ను సాధించిన సినిమాలు కూడా సోషల్ మీడియాల్లో, డబ్బింగ్ వెర్షన్స్లో సూపర్హిట్ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్ చూసిన చిత్రాలుగా నిలిచాయి.
కొన్ని సినిమాలు.. కొన్ని కథలు ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు కానీ ‘బాహుబలి’లాంటి సినిమా చెయ్యాలంటే ప్రభాస్ ఒక్కడే చెయ్యగలడని ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలకు ముందు అనుకున్నారు. రిలీజ్ తర్వాత అవును నిజమే….బాహుబలిగా ప్రభాస్ స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు…అది కూడా రికార్డుల రూపంలో…బహుబలి చిత్రాన్ని ప్రభాస్ కోసమే రాజమౌళి స్పెషల్గా డిజైన్ చేశారు. ప్రభాస్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ‘బాహుబలి’ని ఓ అపురూప శిల్పంలా రూపొందించారు…రూపొందిస్తున్నారు
తెలుగు సినిమా అంటే ఏవో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్.. కొన్ని కామెడీ డైలాగులు పెడితే సరిపోతాయి కదా అనుకున్నవారందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది విజువల్ వండర్ అంటూ అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ బాహుబలి పార్ట్ 1 కోసమే రెండేళ్లు కష్టపడ్డారు. ఈజీగా సినిమాలు చేసుకునే అవకాశాలున్నా ప్రభాస్ ఒక సినిమా కోసం రెండేళ్ళు ఇంకే సినిమా కమిట్ అవకుండా వర్క్ చెయ్యడం ఏమిటి? సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఏమిటి? సినిమా కోసం నిజంగా కత్తి యుద్దాలు నేర్చుకోవడం ఏమిటి? రెండేళ్ళలో ఈజీగా నాలుగు పక్కా కమర్షియల్ సినిమాలు చేసుకుంటే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు అన్నీ వస్తాయి కదా.. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి.. కథ చెప్తానని ఎవరు అడిగినా వినకుండా.. ఏ నిర్మాత ఎంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా.. ఒప్పుకోకుండా సున్నితంగా తిరస్కరిస్తూ.. అందరికీ ప్రభాస్ బాహుబలి కోసమే తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు.
బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్ వెచ్చించిన సమయం నాలుగేళ్లు. ఇలా ఒక స్టార్ హీరో తన కెరీర్లో నాలుగేళ్ళ విలువైన సమయాన్ని ఓ సినిమాకే కేటాయించడం ప్రభాస్ డేడికేషన్కు నిదర్శనం. ఏ సినిమా చేసినా బాహుబలి తర్వాతే అంటూ ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు.. ఎంత గొప్ప సినిమా చేస్తున్నాం అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’ని తన నటనతో జీవం పోస్తున్నాడు ప్రభాస్. అందరి అంచనాలను మించి బాహుబలి ది బిగినింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 600 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. టాలీవుడ్ జక్కన్నగా పేరున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 హై బడ్జెట్తో, విజువల్ టెక్నాలజీతో తెలుగు సినిమా స్టామినాని తెలియజేసింది. సైమా, ఐఫా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అంతే చైనాలో 5000 థియేటర్స్లో విడుదలై సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. చైనాతో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘బాహుబలి’గా ప్రభాస్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడవ్ు టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టిం చబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ నిలవబోతున్నారు. ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ప్రముఖ నటులు, రాజకీయనాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు.
భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్ల పరంగా ప్రపంచంలో మూడవస్ధానంలో, భారతదేశంలో మొదటి స్ధానంలో నిల్చిన ‘బాహుబలి’ ది బిగినింగ్ (2015)’ లో నటించిన ప్రభాస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ప్రభాస్ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైదరా బాద్లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహు బలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.
కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?.. ఈ ప్రశ్న తెలుగు ప్రేక్షకులనే కాదు..ఇండియాలో చాలా ఫేమస్ అయ్యింది. కానీ సమాధానం మాత్రం తెలియడం లేదు..ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 28, 2017 వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే బాహబలి 2 మరి అదే రోజున విడుదలవుతుంది. అయితే ఆలోపే బాహుబలికి సంబంధించి ఫెస్టివల్ను స్టార్స్ చేస్తున్నామని హీరో ప్రభాస్ తెలియజేశారు. నా ఫ్యాన్స్, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ను అక్టోబర్ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేస్తున్నామని ప్రభాస్ అన్నారు. బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్ నుండి విడుదలవుతూ ఆడియన్స్ని ఎగ్జయిట్ చేస్తున్నాయి. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది.
ఒక మహావృక్షంగా తీసుకుంటే టీవీ సీరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హయ్యస్ట్ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అంతే కాకుండా బాహుబలితో వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియెన్స్ అనే దాన్ని పరిచయం చేస్తుండటం విశేషం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ హయ్యండ్ ఎక్స్ పీరియన్స్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మేకింగ్ వీడియోస్ని వర్చువల్ రియాలిటీలో చేస్తున్నారు. మేకింగ్ వీడియోలను కూడా హయ్యండ్ క్వాలిటీస్తో రూపొందిస్తున్నారు. ఇన్ని రకాల విశేషాలతో మరోసారి తెలుగు సినిమా స్టామి నాని, వాల్యూను పెంచి బాహుబలి2 ఎప్పు డెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. బాహుబలి పార్ట్ 1తో 600 కోట్ల కలెక్షన్స్ను సాధించిన హీరో ప్రభాస్ బాహుబలి2తో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు
Mahesh babu back step ..for .. bhubali2. Conclusion....Mahesh cinema out of the race ....

సూపర్ స్టార్ మహేష్ బాబు వెనక్కి తగ్గారు. కమర్షియల్ డైరక్టర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది. ఏప్రిల్ 28 న విడుదల చేయాలని ప్రిన్స్ మొదట భావించారు.
ఆరోజు విడుదలైన పోకిరి సూపర్ హిట్ కావడంతో ఎలాగైనా ఆరోజు సినిమా రిలీజ్ చేయాలని అనుకుకున్నారు. కానీ అదే రోజు బాహుబలి 2 వస్తుందని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయితే ఫస్ట్ డే కలక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుందని అర్ధం చేసుకొని, తన సినిమాను బాహుబలి కంక్లూజన్ కంటే రెండు వారాలు ముందు రిలీజ్ చేయాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 14న సూపర్ స్టార్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
Prabhas birthday special
తెలుగు సినీ పరిశ్రమలో ఈశ్వర్ చిత్రంతో తొలి అడుగు వేసి బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ఛత్రపతి నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ కి ఈ జన్మదినం వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకో ఈ ఆర్టికల్ చదివితే మీకే తెలుస్తుంది.
ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు 1979 అక్టోబర్ 23 న జన్మించారు. 2016 అక్టోబర్ 23 న 37 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సంఖ్యాశాస్రం ప్రకారం 3 + 7 = 10, 1+0 = 1. ప్రభాస్ ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో నంబర్ వన్ గా ఉంటారు.
ప్రభాస్ తన 37 ఏటనే బ్యాచలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఒకరు ఇద్దరు కాబోతున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం షూటింగ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే కల్యాణ ఘడియలు మొదలు కానున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లలో రెబల్ స్టార్
బాహుబలితో ప్రభాస్ కి అన్ని భాషల్లో క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇక డార్లింగ్ చేసే ప్రతి సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. సుజీత్ దర్శకత్వంలో చేయనున్న మూవీ కూడా మూడు భాషల్లో నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ వాళ్లు సన్నాహాలు చేస్తున్నారు.
బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత నుంచి యంగ్ రెబల్ స్టార్ అనే పేరు చెరిగి పోయి ఇండియన్ స్టార్ గా మారనున్నారు. ఇప్పటికే ఇంటర్ నేషనల్ మీడియా ప్రభాస్ ని ఇండియన్ స్టార్ గా పిలుస్తోంది. ఆ గుర్తింపు స్థిరపడిపోనుంది.
ప్రభాస్ తన 37 ఏటనే 15 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అర్ధం కాలేదా.. ? ఆయన రీల్ వయసు 15 కానుంది. యంగ్ రెబల్ స్టార్ తొలి చిత్రం ఈశ్వర్ 2002 నవంబర్ 11న రిలీజ్ అయింది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి నటుడిగా పదిహేనవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
మేడం టుస్సాడ్ వారు బ్యాంకాక్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చిలో ఆవిష్కరించనున్నారు. అంటే ఆ గౌరవం కూడా ప్రభాస్ 37 ఏటనే దక్కనున్నదన్న మాట.
ఇలా ప్రభాస్ కి ఈ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్ కానుంది. అంతేకాదు బాహుబలి కంక్లూజన్ లోని నటనకు దాసోహం అనేందుకు అనేక అవార్డులు రెడీగా ఉన్నాయి.
Prabhas next movie budget fixed
ఫిక్స్ అయిన ప్రభాస్ నెస్ట్ సినిమా బడ్జెట్
బహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు డార్లింగ్ తో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. తెలుగు అభిమానులతో పాటు పొరుగు రాష్ట్రాల వారిని మెప్పించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు కథ, నటీనటులు, టెక్నీషియన్లు అవసరమవుతారు. ప్రభాస్ కి పెరిగిన మార్కెట్ కి సరితూగేలా నిర్మించాలి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని బాహుబలి తర్వాత డార్లింగ్ చేయనున్న సినిమా బడ్జెట్ ని పెంచారు.
“రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రానున్న యంగ్ రెబల్ స్టార్ ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం మొదట 100 కోట్లు ఖర్చుఅవుతుందని భావించారు. తాజాగా ఆ బడ్జెట్ ని 150 కోట్లకు పెంచారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ సినిమా 2017 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
Saturday, October 22, 2016
Friday, October 21, 2016
Gali janardan reddy daughter marrige
గాలి వారి పెళ్లిశుభలేఖ మాయాబజార్ సీన్ ను తలపిస్తోంది... మైనింగ్ కింగ్- గాలి జనార్థన్రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహ ఆహ్వాన పత్రిక వెడ్డింగ్ కార్డ్ను వెరైటీగా.. రిచ్గా.. ఉండేలా రూపొందించారు. బాక్సులో.. పెళ్లి పత్రికతో పాటు L.C.D స్క్రీన్ ఏర్పాటు చేశారు. బాక్స్ ఓపెన్ చేయగానే.. ఆటోమెటిక్గా వీడియో సాంగ్ ప్లే అవుతుంది. సినిమా సాంగ్ రేంజ్లో ఈ ఇన్విటేషన్ సాంగ్ షుట్ చేశారు. ఆహ్వాన పాటలో గాలి ఫ్యామిలీతో పాటు పెళ్లికొడుకు రాజీవ్రెడ్డి కూడా కనిపిస్తారు. అతిధిదేవోభవ.. అభిమానదేవోభవ.. అంటూ పాట ప్రారంభమవుతుంది. జనార్థన్రెడ్డి కూతురు బ్రహ్మణి ఇంట్రడక్షన్ అదిరింది. ఫుల్ లెన్త్ వైట్ డ్రెస్లో.. రిచ్ బ్యాక్గ్రౌండ్తో.. చూపరులను కట్టిపడేస్తోంది బంగారు బొమ్మ. పరుగెత్తే గుర్రాల బ్యాక్గ్రౌండ్తో హీరోయిజం ఉట్టిపడేలా.. వరుడి ఎంట్రీని షూట్ చేశారు. వధువు నోటి నుంచి వరుడి పేరు చెప్పించడం.. అదుర్స్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పెళ్లి కార్డును ముద్రించారు. కార్డుతో పాటు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా అందిస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్ను ఇంత వెరైటీగా తీర్చిదిద్దింది- డైలాగ్ కింగ్ సాయికుమారేనట. పలువురు టాలీవుడ్ టెక్నీషియన్స్తో ఈ వీడియో షూట్ రికార్డు చేయించారట. మాయాబజార్ థీమ్తో రూపొందించిన ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డు ఖరీదు- అక్షరాలా- 6 వేలు. దేశంలోకే ఖరీదైన వెడ్డింగ్ కార్డ్. ఇక ఈ వీడియో సాంగ్ షూట్కూ కోట్లలోనే ఖర్చు చేశారట. ఆ రిచ్నెస్ అంతా ప్రతీ ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఒక నిమిషం పాటు ఇన్విటేషన్ సాంగ్ సాగుతుంది. చివరన.. పెళ్లి ముహూర్తం, వేదిక వివరాలతో సాంగ్ ముగుస్తుంది. నవంబర్ 16న, బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్లో బ్రహ్మణి, రాజీవ్రెడ్డిల వివాహం జరగబోతోంది. ఇన్విటేషన్ కార్డుకే ఇంత ఖర్చు చేసిన గాలి జనార్థన్రెడ్డి.. పెళ్లి ఇంకెంత వైభవోపేతంగా జరిపిస్తారో వేరే చెప్పాలా?
Stoling your debit card data ....be aware
- 32.5 లక్షల డెబిట్ కార్డుల డేటా చోరీ
- ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
దేశచరిత్రలోనే అతి పెద్ద డెబిట్ కార్డ్ ఫ్రాడ్ బయటపడింది. ఎస్ బ్యాంకు ఏటీఎం నెట్వర్క్ కోసం వినియోగించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సర్వర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెట్టిన హ్యాకర్లు.. అక్షరాలా 32.5 లక్షల డెబిట్ కార్డుల వివరాలు దొంగిలించారు. ఈ చోరీ ఈ ఏడాది మే-జూలై నెలల మధ్య జరగ్గా.. సెప్టెంబరులో గుర్తించారు. దీనివెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు. మాల్వేర్ బారిన పడ్డ 32.5 లక్షల కార్డుల్లో 26 లక్షల కార్డులు వీసా, మాస్టర్కార్డ్ ప్లాట్ఫాంపై పనిచేసేవి కాగా, రూపే కార్డులు 6 లక్షల దాకా ఉన్నాయి.ఎస్ బ్యాంకు వినియోగదారులతోపాటు.. ఆ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరిపిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎ్ఫసీ వినియోగదారుల కార్డుల వివరాలు సైతం హ్యాకర్ల చేతిలో పడినట్టు సైబర్ భద్రత నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్డుల డేటా చోరీ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రోజుల క్రితమే అప్రమత్తమై 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసి సదరు వినియోగదారులు తమతమ శాఖలకు వెళ్లి కొత్త డెబిట్ కార్డులను తీసుకోవాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. కానీ.. అది ఎస్బీఐకే పరిమితం కాదని, చాలా బ్యాంకుల వినియోగదారులు ఈ మాల్వేర్ బారిన పడ్డారని ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో తెలిపింది. దీంతో, ఇప్పుడు మిగతా బ్యాంకులు కూడా నష్టనివారణ చర్యలకు నడుం బిగించాయి. వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాల్సిందిగా వినియోగదారులను కోరుతున్నాయి. మాల్వేర్ బారిన పడిన కార్డులను బ్లాక్ చేసి రీకాల్ చేసే పనిలో పడ్డాయి. హెచ్డీఎ్ఫసీ బ్యాంకు మాత్రం కొన్నివారాల క్రితమే దీనిపై చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తమ బ్యాంకు కార్డును ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో వాడిన వినియోగదారులను గుర్తించి.. వారి ఏటీఎం పిన్ను మార్చుకోవాల్సిందిగా సూచించినట్టు తెలిపింది. అలాగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులు ముందుజాగ్రత్త చర్యగా పాతకార్డుల స్థానంలో కొత్తకార్డులను జారీ చేస్తున్నాయి.
డ్రాగన్ దేశంలో..
దొంగిలించిన కార్డుల వివరాల సాయంతో చైనాలో పలు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఏపీ హోతా తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి భారతీయ బ్యాంకు సర్వర్లు, సిస్టమ్స్పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపవలసిందిగా పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. బెంగళూరులోని పేమెంట్ సెక్యూరిటీ సంస్థ ఎస్ఐఎ్సఏను ఆదేశించింది. మాల్వేర్ ఎక్కడ, ఎలా ప్రవేశించిందో ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల తెలుస్తుందని హోతా అభిప్రాయపడ్డారు. ఇక.. డెబిట్కార్డుల డేటా చోరీపై మాస్టర్కార్డ్ స్పందించింది. తమ సిస్టమ్స్ ఎలాంటి భద్రత ఉల్లంఘనకూ గురికాలేదని స్పష్టం చేసింది. అలాగే, కార్డుల డేటా చోరీకి సంబంధించి వివరాలు తెలపాల్సిందిగా ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. అలాగే.. దీనివల్ల ఎదురయ్యే చిక్కులేంటో తెలపాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ను కోరినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డేటా చోరీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అలాంటి భయాన్ని వీడాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘దేశంలోని డెబిట్కార్డుల్లో కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు మాత్రమే చోరీకి గురయ్యాయి. మిగతా 99.5 శాతం కార్డులూ సురక్షతమే. బ్యాంకు వినియోగదారులు ఆందోళన చెందవద్దు’’ అని ఆ శాఖలోని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము పేర్కొన్నారు. మేం కాదంటే.. మేం కాదు..
కార్డుల డేటా తస్కరణకు గురైంది! 32.5 లక్షల కార్డుల భద్రతకు ముప్పు ఏర్పడింది. ఈ రెండూ కంటి ముందు కనపడుతున్న వాస్తవాలే. కానీ.. తప్పు తమదగ్గర జరగలేదంటే తమ దగ్గర జరగలేదని ఎస్ బ్యాంకు, హిటాచీ సిస్టమ్స్ చెబుతున్నాయి. తప్పు హిటాచీ సిస్టమ్స్దేనని ఎస్బ్యాంకు పరోక్షంగా చెబుతుండగా.. తమ వద్ద ఎలాంటి సమస్యా లేదని.. ‘కావాలంటే ఈ రిపోర్టు చూడండి’ అని ఎక్స్టర్నల్ ఆడిట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదికను హిటాచీ సిస్టమ్స్ చూపుతోంది. వారి వాదన ఎలా ఉన్నా.. ఇబ్బంది పడుతోంది మాత్రం వినియోగదారులు.
నల్లమల అడవుల్లో ఉన్న వజ్రాల కొండ గుహ గురించి ఆసక్తికరమైన విషయాలు…
నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే(స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అంత కష్టం మరియు పెద్ద సాహసం. అది కూడా వర్షాకాలం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే సెల్ ఫోన్ లు పనిచేయవు, రాత్రి పూట చాల భయంకరంగా ఉంటుంది , తిండి ఉండదు కనీసం తాగటానికి నీళ్ళు కూడా దొరకడం కష్టం. ఎక్కడ పులులు, సింహాలు వచ్చి మీద పడతాయని భయం. అందుకని చాల జాగ్రత్తాగా గ్రూప్ గా వెళ్ళాల్సిన ప్రదేశం. అయితే అక్కడ ఉన్న ఆ ప్రత్యేకతలను, గొప్పతనాన్ని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాము. మీరు చూసి ఆనందిచండి, అంత దూరం వెళ్లి ఆ అద్భుతాలను చూడలేని వాళ్ళకు ఇవి చూపించండి…
ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.!! మీరు తప్పక చదవండి. షేర్ చెయ్యండి. About Hinduism and hindudharma
1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన “హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ?
3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లిమేతరుడిని ప్రధానిగా , కాని అధ్యక్షుడిగా కాని కల్గి ఉందా ?
4) తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ముల్లా కాని మౌల్వి కాని “ ఫత్ఫా “ ను జారి చేసారా ?
5) హిందువులు మేజారిటిగా గా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ,పాండిచేరి మొదలైన రాష్ట్రాలలో అనేక పర్యాయాలు ముస్లిం మతస్తుడు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు, ముస్లింలు మేజారిటిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో కాని,క్రైస్తవులు మేజరిటిగా ఉన్న నాగాలాండ్,మిజోరం లాంటి రాష్ట్రాలలో ఒక హిందువును ముఖ్యమంత్రి గా ఉహించుకోగలమా ?
6) దేశం లో ఉన్న 85% హిందువులు సెక్యులర్ కాక పొతే , మస్జిద్ లు, మదర్సా లు ఎలా మనగల్గుతున్నాయి ?, ముస్లింలు రోడ్లపై “నమాజ్”ఎలా చేయగల్గుతున్నారు ?, రోజుకు ఐదు సార్లు“అల్లాహ” తప్ప మరెవరు దేవుడు కాదని లౌడ్ స్పీకర్లు పెట్టి మరి ఎలా చెప్పగల్గుతున్నారు ?
7) ముస్లింల కోరిక మేరకు భారత్ లోని 30% భూభాగాన్ని హిందువులు వాడులుకున్నప్పుడు , అయోధ్య , మధుర, కాశీ లాంటి పుణ్య స్థలాల కోసం వారిని అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకేందుకు ?
8) హిందూ దేవాలయాల ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుపెడ్తున్న ప్రభుత్వం , వారి ప్రార్థన స్థలాల ఆదాయాన్ని ముట్టె సాహసం చేయగలదా ?
9) భారత స్వసంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబందం లేని ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ ఎందుకు మద్దతిచ్చారు ?
10) క్రైస్తవ, ముస్లిం పాఠశాలలో బైబిల్,ఖురాన్ బోదనలు నేరం కానప్పుడు భగవత్గీత బోదన తప్పేలా అవుతుంది ?
11) “హజ్ యాత్రకు సబ్సిడి ఇస్తున్న ప్రభుత్వంఅమరనాథ్ , మాసన సరోవరం యాత్రలకు రెట్టింపు పన్నులు విదిస్తుంది , ఇదెక్కడి న్యాయం ?
12) కేరళ లో MLA,MP,మంత్రులు అల్లాహ , క్రీస్తుపేరుతొ ప్రమాణ స్వీకారం రాజ్యంగా విరుద్దం అయిన చేస్తున్నారు ఎందుకు ?
13) అస్సాం లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థిర సివాసం ఏర్పాటు చేసుకోవడానికి IMTD చట్టం ఉతమిచ్చింది , కాని భారతియులైనప్పటికి జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు ! ఎందుకి ద్వంద నీతి ?
14) భారత దేశం లోని అన్ని రాస్త్రాలాగానే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం అలాంటప్పుడు ప్రత్యెక స్వయం ప్రతిపత్తి ఎందుకు ?
15) పాఠశాల విద్యార్థులకు సైతం యునిఫం ఉండే మన దేశం లో దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు సాద్యం కావడం లేదు ?
16) దీపావళి లాంటి పండుగులను వైట్ హౌస్ , బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా జరుపుకుంటున్నాయి , అలాంటప్పుడు మన పార్లమెంట్ లో ఎందుకు జరుపుకోకూడదు ?
17) ఇస్లాం శాంతి కామక మతం అయితే , ఖురాన్ ను చదివి ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ?
18) “ ఈశ్వర్ అల్లాహ తేరే నామ్ “ – దిన్ని ఒప్పుకునే ఒక ముస్లిం మౌల్విని చూపండి ?
19) దేశ జనాభాలో 10% కంటే తక్కువగా ఉన్నవారినే మైనరిటిలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది , అలాంటప్పుడు 15% కంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనరిటిలుగా ఎలా పరిగణించబడతారు ?
20) హిందు ఆధిక్య ప్రాంతం లో ఉన్న ముస్లిం కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటున్నాయి, ముస్లిం ఆధిక్య ప్రాంతం లో హిందూ కుటుంబం శాంతిగా జివించగలదా ?
21) హిందూ మెజారిటి ఉన్న రాష్ట్రలు ప్రశాంతంగానే ఉంటున్నాయి , కాని జమ్మూ, నాగాలాండ్, మిజోరం ఎందుకలా లేవు ?
22) జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పాకిస్తానీ జమ్మూ పౌరునిగా మారుతున్నాడు, కాని జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భారతీయుడు జమ్మూ నివాసిగా మారడానికి అనర్హుడు ఇదెక్కడి న్యాయం ?
23) క్రైస్తావురాలిని పెళ్ళి చేసుకున్న J&K మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్ల, హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కుమారుడి వివాహాన్ని అంగీకరించి , హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కూతురి వివాహాన్ని అంగీకరించలేదు కారణం ?( ఇదే సేక్యులరిసం )
24) దురక్రమదారుడైన బాబర్ పేరుతొ అయోధ్యలో మస్జిద్ నిర్మాణం మీకు అంగీకారమ ?
25) హిందూ ఆధిక్యత గల ప్రాంతాల నుండి మొహర్రం యాత్ర సాఫీగా సాగుతుంది , ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం నుండి వినాయక యాత్ర సాఫీగా సాగుతుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ?
3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లిమేతరుడిని ప్రధానిగా , కాని అధ్యక్షుడిగా కాని కల్గి ఉందా ?
4) తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ముల్లా కాని మౌల్వి కాని “ ఫత్ఫా “ ను జారి చేసారా ?
5) హిందువులు మేజారిటిగా గా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ,పాండిచేరి మొదలైన రాష్ట్రాలలో అనేక పర్యాయాలు ముస్లిం మతస్తుడు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు, ముస్లింలు మేజారిటిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో కాని,క్రైస్తవులు మేజరిటిగా ఉన్న నాగాలాండ్,మిజోరం లాంటి రాష్ట్రాలలో ఒక హిందువును ముఖ్యమంత్రి గా ఉహించుకోగలమా ?
6) దేశం లో ఉన్న 85% హిందువులు సెక్యులర్ కాక పొతే , మస్జిద్ లు, మదర్సా లు ఎలా మనగల్గుతున్నాయి ?, ముస్లింలు రోడ్లపై “నమాజ్”ఎలా చేయగల్గుతున్నారు ?, రోజుకు ఐదు సార్లు“అల్లాహ” తప్ప మరెవరు దేవుడు కాదని లౌడ్ స్పీకర్లు పెట్టి మరి ఎలా చెప్పగల్గుతున్నారు ?
7) ముస్లింల కోరిక మేరకు భారత్ లోని 30% భూభాగాన్ని హిందువులు వాడులుకున్నప్పుడు , అయోధ్య , మధుర, కాశీ లాంటి పుణ్య స్థలాల కోసం వారిని అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకేందుకు ?
8) హిందూ దేవాలయాల ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుపెడ్తున్న ప్రభుత్వం , వారి ప్రార్థన స్థలాల ఆదాయాన్ని ముట్టె సాహసం చేయగలదా ?
9) భారత స్వసంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబందం లేని ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ ఎందుకు మద్దతిచ్చారు ?
10) క్రైస్తవ, ముస్లిం పాఠశాలలో బైబిల్,ఖురాన్ బోదనలు నేరం కానప్పుడు భగవత్గీత బోదన తప్పేలా అవుతుంది ?
11) “హజ్ యాత్రకు సబ్సిడి ఇస్తున్న ప్రభుత్వంఅమరనాథ్ , మాసన సరోవరం యాత్రలకు రెట్టింపు పన్నులు విదిస్తుంది , ఇదెక్కడి న్యాయం ?
12) కేరళ లో MLA,MP,మంత్రులు అల్లాహ , క్రీస్తుపేరుతొ ప్రమాణ స్వీకారం రాజ్యంగా విరుద్దం అయిన చేస్తున్నారు ఎందుకు ?
13) అస్సాం లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థిర సివాసం ఏర్పాటు చేసుకోవడానికి IMTD చట్టం ఉతమిచ్చింది , కాని భారతియులైనప్పటికి జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు ! ఎందుకి ద్వంద నీతి ?
14) భారత దేశం లోని అన్ని రాస్త్రాలాగానే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం అలాంటప్పుడు ప్రత్యెక స్వయం ప్రతిపత్తి ఎందుకు ?
15) పాఠశాల విద్యార్థులకు సైతం యునిఫం ఉండే మన దేశం లో దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు సాద్యం కావడం లేదు ?
16) దీపావళి లాంటి పండుగులను వైట్ హౌస్ , బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా జరుపుకుంటున్నాయి , అలాంటప్పుడు మన పార్లమెంట్ లో ఎందుకు జరుపుకోకూడదు ?
17) ఇస్లాం శాంతి కామక మతం అయితే , ఖురాన్ ను చదివి ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ?
18) “ ఈశ్వర్ అల్లాహ తేరే నామ్ “ – దిన్ని ఒప్పుకునే ఒక ముస్లిం మౌల్విని చూపండి ?
19) దేశ జనాభాలో 10% కంటే తక్కువగా ఉన్నవారినే మైనరిటిలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది , అలాంటప్పుడు 15% కంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనరిటిలుగా ఎలా పరిగణించబడతారు ?
20) హిందు ఆధిక్య ప్రాంతం లో ఉన్న ముస్లిం కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటున్నాయి, ముస్లిం ఆధిక్య ప్రాంతం లో హిందూ కుటుంబం శాంతిగా జివించగలదా ?
21) హిందూ మెజారిటి ఉన్న రాష్ట్రలు ప్రశాంతంగానే ఉంటున్నాయి , కాని జమ్మూ, నాగాలాండ్, మిజోరం ఎందుకలా లేవు ?
22) జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పాకిస్తానీ జమ్మూ పౌరునిగా మారుతున్నాడు, కాని జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భారతీయుడు జమ్మూ నివాసిగా మారడానికి అనర్హుడు ఇదెక్కడి న్యాయం ?
23) క్రైస్తావురాలిని పెళ్ళి చేసుకున్న J&K మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్ల, హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కుమారుడి వివాహాన్ని అంగీకరించి , హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కూతురి వివాహాన్ని అంగీకరించలేదు కారణం ?( ఇదే సేక్యులరిసం )
24) దురక్రమదారుడైన బాబర్ పేరుతొ అయోధ్యలో మస్జిద్ నిర్మాణం మీకు అంగీకారమ ?
25) హిందూ ఆధిక్యత గల ప్రాంతాల నుండి మొహర్రం యాత్ర సాఫీగా సాగుతుంది , ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం నుండి వినాయక యాత్ర సాఫీగా సాగుతుందా ?
ఒక్క సారి ఆలోచించండి నా హిందూ సోదరులు …
Telangana cm KCR met aliminani krishnarao
- మీ ఇష్టం.. ఏది ఇచ్చినా తీసుకుంటా..!
- సీఎం కేసీఆర్ ఇంట్లో కృష్ణారెడ్డి మధ్యాహ్న భోజనం
హైద్రాబాద్ ఆదాయంలో ఏపీకి వాట ఇస్తారా…
తిరుపతి వెంకన్న ఆదాయంలో 1987 ఎండోమెంట్ యాక్టు ప్రకారం 7 శాతం ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్కు, 5 శాతం కామన్ గుడ్ ఫండ్, అర్చక సంక్షేమ నిధికి 3 శాతం మొత్తం కలిపి 15 శాతం ఇవ్వాలని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ హైకోర్టులో పిల్ వేయడం కొత్త మలుపు తిరిగింది. సుమారు వెయ్యికోట్ల పాత బకాయిలు చెల్లించాలంటూ సౌందర రాజన్ వేసిన ఈ పిల్ రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. ఈ పిల్పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తిరుపతి ఆదాయంలో వాటా కోరుతున్న వారు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఆదాయం విషయంలోనూ అదే విషయాన్ని పాటిస్తారా అని ప్రశ్నించారు
సౌందర రాజన్ పిటిషన్పై గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందిస్తూ తిరుమలకు ఎన్టీఆర్ స్పెషల్ స్టేటస్ ఇచ్చారని, ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే ఉండాలని, ఈవోను నియమించాలని, మిగతా విషయాలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేశారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 10వ షెడ్యూల్ లో ఉన్న 142 సంస్థలను 58:42 నిష్పత్తిలో ఆస్తులను పంచకుండా అడ్డుపడుతూ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారని గాలి మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అందరూ కలిసే అభివృద్ధి చేసుకున్నామని చెప్పిన ముద్దుకృష్ణమ హైదరాబాద్లో 50 శాతం మంది ఏపీ వారున్నారని తెలిపారు. వీరు ట్యాక్స్లు కడుతున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 జిల్లాల నుంచి 40 శాతం ఆదాయం వస్తే ఒక్క హైదరాబాద్ నుంచే 60 శాతం ఆదాయం వచ్చేదని గెలిపారు. అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను తెలంగాణకు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్కు 16 వేల కోట్ల రూపాయల లోటు, తెలంగాణ రాష్ట్రానికి 15 వేల కోట్ల రూపాయల మిగులు వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి సౌందర రాజన్ ఈ విషయాలను చెప్పి హైదరాబాద్లో వచ్చే ఆదాయాన్ని పంచాల్సిందిగా కోరాలని ఆయన సూచించారు.
Puris ijam rating
నిర్మాణ సంస్థ: యన్.టి.ఆర్.ఆర్ట్స్
తారాగణం: నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, బండ రఘు, శత్రు, అజయ్ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్(ముంబై), రవి(ముంబై) తదిరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ముఖేష్
ఎడిటింగ్: జునైద్
పాటలు: భాస్కరభట్ల
ఫైట్స్: వెంకట్
ఆర్ట్: జానీ
నిర్మాత: నందమూరి కళ్యాణ్రామ్
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
హీరోలోని మాస్ యాంగిల్ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ, సినిమాలో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే దర్శకుల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. అందుకే ఈ తరం యంగ్ హీరోలు అందరూ పూరి దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకుంటారు.టెంపర్ సినిమాలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై తన స్వరాన్ని వినిపించిన పూరి ఈసారి ఇజం సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ ద్వారా బ్లాక్ మనీపై గళం విప్పారు. ఇజం సినిమా ముందు వరకూ బొద్దుగా ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్కు టెంపర్తో సూపర్హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి, కళ్యాణ్రామ్కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. మరి పూరి, ఇజం ద్వారా ఏం చెప్పాడో చూద్దాం.....
కథ:
అండర్ వరల్డ్ డాన్ జావేద్ ఇబ్రహీం(జగపతిబాబు) ఎవరికీ తెలియని ద్వీపంలో ఉంటూ ఇండియాలో అండర్ వరల్డ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. జావేద్ కుమార్తె అలియా(ఆదితి ఆర్య). ఇండియాలో రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలను జావేద్ తన బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్లో దాస్తుంటాడు. జావేద్కు ఇండియాలో కోటిలింగం(పోసాని కృష్ణమురళి) అనే సెంట్రల్ మినిష్టర్ సపోర్ట్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో స్ట్రీట్ ఫైట్ చూడటానికి వెళ్లిన అలియాను, అక్కడ ఫైట్ చేయడానికి వచ్చిన సత్య మార్తాండ్(కళ్యాణ్రామ్) చూసి ప్రేమించి ఆమె వెంటపడతాడు. అలియాను కూడా సత్య తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. అయితే కథ అక్కడే మలుపు తిరుగుతుంది. సత్య మార్తాండ్ను కలవడానికి వచ్చిన జావేద్ ఉన్నట్టుండి తనపై కాల్పులు జరుపుతాడు.జావేద్ కాల్పుల నుండి సత్య తప్పించుకుంటాడు. ఇంత సత్య మార్తాండ్ ఎవరు? జావేద్కు, సత్యకు ఉన్న లింకేంటి? గ్రాండ్ లీకేజ్ వెబ్ సైట్కు,సత్యకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు సత్య సమాజానికి ఏం చేయాలనుకుంటాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
ప్లస్ పాయింట్స్
- కళ్యాణ్ రామ్ నటన
- అనూప్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
- పూరి డైలాగ్స్
మైనస్ పాయింట్స్
- ఫస్టాఫ్
- క్లైమాక్స్
విశ్లేషణ: 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇండియన్ కరెన్సీకి, డాలర్కు సమానమైన విలువ ఉండేది. కానీ ఇప్పుడు రూపాయి విలువ డాలర్ కంటే 70 శాతం వెనకబడింది. అందుకు కారణం. లంచం...ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరనీయకుండా మన దేశంలో రాజకీయ నాయకులు లక్షలు కోట్లు బ్లాక్ మనీని సంపాదించి ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో దాస్తున్నారు. దాని వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్య ఏర్పడమే కాకుండా రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలితో రోజుకు సగటు ఏడు వేల మంది దాకా చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారం విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని మనదేశానికి రప్పించడమే. అలా వచ్చిన డబ్బులో పది శాతమో, ఇరవై శాతమో పేద వాళ్ల కోసం ఖర్చు పెడితే దేశంలో పేదరికం అనేది ఉండదు...అలా ఖర్చు పెట్టకపోతే అప్పుడు దేశంలోని సమస్యకు కారణం మనమే అవుతాం.. సింపుల్గా చెప్పాలంటే ఇజం కథాంశమిదే. ఈ పాయింట్ను చెప్పాలనుకున్న పూరి తనదైన స్టైల్లో ముఖంపై కొట్టేలా చెప్పాడు. స్వాతంత్రానికి ముందు తెల్లవాళ్లు దేశాన్ని దోచుకున్నారని చదువుకుంటున్నాం కానీ వాళ్లు మనకు రోడ్లు, రైలు, నౌకాయానం, విమానం, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలను నేర్పించారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత మనల్ని మనమే దోచుకుంటున్నాం..ఇప్పుడు మనం చదువుకోవాల్సిందే ఎప్పుడో దేశాన్ని దోచుకున్న తెల్లవాడి గురించి కాదు..ఇప్పుడు దేశాన్ని దోచుకుంటున్న నల్లవాడి గురించే...
బ్లాక్లో కొందామనుకున్నామంచివాడనేవాడు కనపడటం లేదు...వంటి డైలాగ్స్తో పూరి తనలో రచయితకు బాగానే పని చెప్పాడు. ఇంటర్వెల్ ముగిసిన తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను పూరి ఆసక్తికరంగా నడిపాడు. అయితే ఎప్పటిలాగే ఫస్టాఫ్లో హీరో, హీరోయిన్ను ఏడిపించడం, డాన్ జావేద్ దగ్గర రహస్యాలను రాబట్టం అనే కథాంశంతో ఫస్టాఫ్ చప్పగా ఉంది. ప్రీ క్లైమాక్స్లో క్లైమాక్స్ ఉంది. పూరి ఆ సంగతిని మరిచాడేమో..అక్కడ నుండి సినిమాను సాగదీయడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది.
కథ, కథనం విషయంలో పూరి మరింత జాగ్రత్త తీసుకుని ఉండుంటే సినిమా ఇంకా బావుండేదనిపించింది. ముఖేష్ సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా ఇటలీ అందాలను తన కెమెరాలో చక్కగా బంధించాడు. అనూప్ అందించిన సంగీతం కనులు నీవైనా అనే సాంగ్..హీరోయిన్ టీజింగ్ సాంగ్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే..కళ్యాణ్రామ్ నటనపరంగా మంచి మార్కులను కొట్టేశాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కేర్ తీసుకుని సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. పూరి టేకింగ్ వల్ల కళ్యాణ్రామ్లో కొత్త కోణం బయటకు వచ్చింది. హీరోయిన్ ఆదితి ఆర్య పాత్ర ఉండాలంటే ఉంది అన్నట్లు కనపడింది. పవర్ఫుల్ డాన్ అంటూ జగపతిబాబు చేసిన జావేద్ పాత్ర సినిమా ఆసాంతం తేలిపోయింది. ఈ పాత్రను జగపతిబాబులాంటి సీనియర్ హీరో చేయాల్సిందేనా అనే ఆలోచన వస్తుంది. వెన్నెల కిషోర్, అలీ కామెడి ఏదో ఉందంటే ఉందనిపిస్తుంది. తనికెళ్ల భరణి, ఈశ్వరీరావు, పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
బోటమ్ లైన్: గతి తప్పిన పూరి జర్నలి(ఇ)జం..
రేటింగ్: 2.5/5
Thursday, October 20, 2016
Subscribe to:
Posts (Atom)